విద్యుదాఘాతంతో యువకుడు మృతి

ABN , First Publish Date - 2023-06-07T00:04:22+05:30 IST

మండలంలోని బెలుం గ్రామం నాపరాయి గనుల్లో ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై బెలుం గ్రామానికి చెందిన ప్రతాప్‌ (23) అనే యువకుడు మృతి చెందాడు.

   విద్యుదాఘాతంతో యువకుడు మృతి

కొలిమిగుండ్ల, జూన 6 : మండలంలోని బెలుం గ్రామం నాపరాయి గనుల్లో ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై బెలుం గ్రామానికి చెందిన ప్రతాప్‌ (23) అనే యువకుడు మృతి చెందాడు. మంగళవారం ఈ ఘటన జరిగింది. ప్రతాప్‌ బెలుం- మీర్జాపురం గ్రామాల మధ్య ఉన్న సొంత గనిలో నాపరాళ్లు వెలికితీసే పనులు చేస్తుండగా పక్కనే ఉన్న కరెంట్‌ తీగ ప్రమాదవశాత్తూ ప్రతాప్‌కు తగిలి అక్కడకిక్కడే మృతి చెందినట్లు ఎస్‌ఐ రమేశరెడ్డి తెలిపారు. ప్రతాప్‌ మృతదేహాన్ని బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు పోస్టుమార్టం కోసం తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2023-06-07T00:04:22+05:30 IST