ఆటోను ఢీకొన్న కంకర లారీ
ABN , First Publish Date - 2023-03-25T23:07:43+05:30 IST
మండలంలోని దొర్నిపాడు కేసీకెనాల్ కట్ట వద్ద ఆగి ఉన్న ఆటోను సిమెంట్ కంకర లారీ ఢీకొనడంతో ఇసుకపల్లి ఎర్రలింగమయ్య (58) అక్కడికక్కడే మృతి చెందాడు.
వ్యక్తి మృతి
దొర్నిపాడు, మార్చి 25: మండలంలోని దొర్నిపాడు కేసీకెనాల్ కట్ట వద్ద ఆగి ఉన్న ఆటోను సిమెంట్ కంకర లారీ ఢీకొనడంతో ఇసుకపల్లి ఎర్రలింగమయ్య (58) అక్కడికక్కడే మృతి చెందాడు. మండలంలోని అర్జునాపురం గ్రామానికి చెందిన ఇసుకపల్లి ఎర్రలింగమయ్య శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో కేసీకెనాల్ కట్ట సమీపంలో పెట్రోల్ బంకు వద్ద ఆగిఉన్న ఆటో డ్రైవర్తో మాట్లాడుతుండగా కోవెలకుంట్ల నుంచి ఆళ్లగడ్డ వైపు పీఎం28బీఎఫ్6440 నంబర్గల సిమెంట్, కంకర లోడ్ లారీ అతివేగంగా వస్తూ ఆటోను ఢీకొనడంతో ఆటో వరి పొలాల్లో పడిపోయింది. పక్కనే ఉన్న ఇసుకపల్లి ఎర్రలింగమయ్య టైర్ల కిందపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటో డ్రైవర్కు స్వల్ప గాయాలు అయ్యాయి. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. మృతుడి అన్న ఇసుకపల్లి నాగలింగమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్ఐ ప్రతాప్రెడ్డి తెలిపారు.