బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఒకరి మృతి

ABN , First Publish Date - 2023-03-25T23:08:45+05:30 IST

బైక్‌ను కారు ఢీకొని ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

   బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఒకరి మృతి

ముగ్గురికి గాయాలు

మంత్రాలయం, మార్చి 25: బైక్‌ను కారు ఢీకొని ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. కోసిగి మండలం ఐరంగల్‌ గ్రామానికి చెందిన జంబయ్య (33) తన భార్య ఊరైన పెద్దకడుబూరులో ఉంటూ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంత్రాలయంలో బీసీ హాస్టల్‌లో 7వ తరగతి చదువుతున్న నంద కిషోర్‌ను చూసేందుకు జంబయ్య శనివారం మోటారు సైకిల్‌పై బయలుదేరాడు. అనంతపురానికి చెందిన కుటుంబ సభ్యులు ఇన్నోవా కారులో రాఘవేంద్రస్వామి దర్శనార్థం మంత్రాలయం వస్తున్నారు. చిలకలడోణ గ్రామ సమీపంలో జంబయ్య బైక్‌ను బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కారు అదుపు తప్పి బోల్తా పడింది. కారులో ఉన్న అనంతపురానికి చెందిన సాయి, డ్రైవర్‌ నవీన కుమార్‌, మరో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ఎస్‌ఐ వేణుగోపాల్‌రాజు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతునికి భార్య లక్ష్మి, ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు నిహారిక, నిఖితలు ఉన్నారు. భార్య ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-03-25T23:08:45+05:30 IST