ఇంటర్ పరీక్షలో 12 మంది డీబార్
ABN , First Publish Date - 2023-03-25T23:15:54+05:30 IST
ఉమ్మడి జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు మాస్ కాపీయింగ్కు పాల్పడిన 12 మందిని డీబార్ చేసినట్లు ఆర్ఐవో ఎస్వీఎస్ గురువయ్యశెట్టి తెలిపారు.
కర్నూలు(ఎడ్యుకేషన్), మార్చి 25: ఉమ్మడి జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు మాస్ కాపీయింగ్కు పాల్పడిన 12 మందిని డీబార్ చేసినట్లు ఆర్ఐవో ఎస్వీఎస్ గురువయ్యశెట్టి తెలిపారు. ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఐదుగురు, దేవనకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నలుగురు, ఆళ్లగడ్డ ప్రజ్ఞ జూనియర్ కళాశాల, బేతంచెర్ల ఆదర్శ పాఠశాలలో ఒక్కొక్కరి చొప్పున డీబార్ అయ్యారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలో 37,485 మంది నమోదు చేసుకున్నారు. 36,012 మంది పరీక్షకు హాజరు కాగా, 1473 మంది గైర్హాజరయ్యారు. జనరల్ కోర్సులో 34,253 మందికిగాను 33 వేల మంది పరీక్షకు హాజరు కాగా, 1253 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సులో 3232 మందికిగాను 3012 మంది హాజరు కాగా, 220 మంది గైర్హాజరయ్యారు. 103 పరీక్ష కేంద్రాలను ఆర్ఐవో, డీవీఈవోస్, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్స్, కస్టోడిన్స సభ్యులు తనిఖీ చేశారు.