ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్‌ తనిఖీలు

ABN , First Publish Date - 2023-06-01T00:33:25+05:30 IST

నందిగామలోని ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహిం చారు

ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్‌ తనిఖీలు

నందిగామ, మే 31: నందిగామలోని ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహిం చారు. బుధవారం విజిలెన్స్‌ ఏడీ కల్యాణ్‌ ఆధ్వర్యంలో సిబ్బంది ఎరువుల షాపులు, విత్తనాల షాపులను తనిఖీ చేశారు. నకిలీ విత్తనాల విక్రయాలు జరిపితే సహించేది లేదని షాపుల యజమానులను కల్యాణ్‌ హెచ్చరించారు. బిల్లుల లేకుండా ఎరువులు గానీ, పురుగుమందులు గానీ విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్‌ అధికారులు పాల్గొన్నారు.

జగ్గయ్యపేటలోని విత్తనాల దుకాణాల్లోనూ..

జగ్గయ్యపేట, మే 31:పట్టణంలో విత్తన దుకాణాలను జగ్గయ్యపేట మండల వ్యవసాయాధికారి వరలక్ష్మి బుధవారం తనిఖీ చేశారు.దుకాణాల లైసెన్స్‌లు, రిజిస్టర్లు, బిల్లుబుక్‌లను పరిశీలించారు. అనుమతి లేని కంపెనీల విత్తనాల ప్యాకెట్లను విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - 2023-06-01T00:34:28+05:30 IST