టీటీడీ బోర్డు సభ్యునిగా ఉదయభాను
ABN , First Publish Date - 2023-08-26T00:50:13+05:30 IST
తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడిగా జగ్గ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు స్థానం దక్కింది.
విజయవాడ, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి) : తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడిగా జగ్గ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు స్థానం దక్కింది. కమిటీని శుక్రవారం రాత్రి మొత్తం 24 మంది సభ్యులతో ప్రభుత్వం నియమించింది. ఉదయభాను 1999లో రాజకీయాల్లోకి ప్రవేశించి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత 2004లో ఎమ్మెల్యే అయ్యారు. 2009, 20014 సంవత్సరాల్లో ఓటమి పాలయ్యారు. తిరిగి 2019లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నిక య్యారు. జగన్ మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావించినప్పటికీ కొన్ని కారణాల రీత్యా ఆ అవకాశం దక్కలేదు. ప్రస్తుతం ప్రభుత్వ విప్గా కొనసాగుతున్నారు. ఇప్పుడు టీటీడీ బోర్డు సభ్యత్వం దక్కింది.