Amaravathi: ఇద్దరు జిల్లా పంచాయితీ అధికారులకు జైలు శిక్ష విధించిన హైకోర్టు

ABN , First Publish Date - 2023-01-19T14:40:49+05:30 IST

అమరావతి (Amaravathi): ఇద్దరు జిల్లా పంచాయితీ అధికారులకు కోర్టు ధిక్కార కేసులో హైకోర్టు (High Court) జైలు శిక్ష విధించింది.

Amaravathi: ఇద్దరు జిల్లా పంచాయితీ అధికారులకు జైలు శిక్ష విధించిన హైకోర్టు

అమరావతి (Amaravathi): ఇద్దరు జిల్లా పంచాయితీ అధికారులకు కోర్టు ధిక్కార కేసులో హైకోర్టు (High Court) జైలు శిక్ష విధించింది. గతంలో కర్నూలు జిల్లా డీపీవో (DPO)గా పనిచేసి ప్రస్తుతం అనంతపురంలో ఉన్న ప్రభాకర్ రావుకు న్యాయస్థానం వారం రోజులు జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధించింది. మరో కేసులో చిత్తూరు జిల్లా పంచాయితీ అధికారి దశరధ రామిరెడ్డికి 15 రోజులు జైలు శిక్ష, 2 వేల రూపాయలు జరిమానా విధించింది. అయితే తీర్పు అమలును వారం రోజుల పాటు నిలిపివేస్తూ.. అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఇచ్చింది.

జలవనరుల శాఖ స్థలంలో గ్రామ సచివాలయం నిర్మాణంపై గతంలో హైకోర్టు స్టే ఇచ్చింది. స్టే ఉన్నప్పటికీ అప్పటి కర్నూలు జిల్లా డీపీవో ప్రభాకర్ రావు సర్పంచ్ చెక్ పవర్‌ను సస్పెండ్ చేసి ఈవో ఆర్‌డీ ద్వారా చెల్లింపులు చేశారని అభియోగం రావడంతో న్యాయస్థానం సూమోటోగా కోర్టుధిక్కార కేసు నమోదు చేసి ఈ మేరకు శిక్ష ఖరారు చేసింది.

Updated Date - 2023-01-19T14:40:52+05:30 IST