పండగ పూట విషాదం..

ABN , First Publish Date - 2023-03-31T01:00:00+05:30 IST

పండగపూట ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీరామనవమి నాడు ఆ ఇంటి ఇల్లాలు తన భర్త చేతిలో అతి దారుణంగా హత్యకు గురైంది.

పండగ పూట విషాదం..

ఎ.కొండూరు, మార్చి 30 : పండగపూట ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీరామనవమి నాడు ఆ ఇంటి ఇల్లాలు తన భర్త చేతిలో అతి దారుణంగా హత్యకు గురైంది. ఎ.కొండూరు ఎస్సై ఆర్‌.అంకారావు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గోపాలపురం తండాకు చెందిన లక్ష్మీ(40)కి ఆదే తండాకు చెందిన కోటేశ్వరరావుతో 23 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. వ్యసనాలకు బానిసైన కోటేశ్వరరావు నిత్యం కుటుంబసభ్యులతో ఘర్షణ పడుతుండేవాడు. ఇటీవల భార్యపై అనుమానం పెంచుకున్న కోటేశ్వరావు గురువారం రాత్రి సమయంలో పథకం ప్రకారం గొడ్డలితో భార్యను అతి కిరాతకంగా నరికి చంపినట్టు పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లి ద్వాళా ఫిర్యాదు మేరుకు తిరువూరు సీఐ భీమారాజు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎ్‌స్‌ఐ తెలిపారు.

Updated Date - 2023-03-31T01:00:00+05:30 IST