నేడు ట్రాఫిక్ మళ్లింపు
ABN , First Publish Date - 2023-05-26T00:54:16+05:30 IST
తుళ్లూరు మండలం వెంకటపాలెంలోని టీటీడీ ఆలయం పక్కన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 4 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు అమల్లో ఉంటుందని పోలీస్ కమిషనర్ కాంతిరాణా ఒక ప్రకటనలో తెలిపారు.

గుణదల, మే 25 : తుళ్లూరు మండలం వెంకటపాలెంలోని టీటీడీ ఆలయం పక్కన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 4 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు అమల్లో ఉంటుందని పోలీస్ కమిషనర్ కాంతిరాణా ఒక ప్రకటనలో తెలిపారు.
చెన్నై వైపు నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం, ఇబ్రహీంపట్నం, నందిగామ వైపు వెళ్లే వాహనాలు ఒంగోలు జిల్లా త్రోవగుంట వద్ద నుంచి చీరాల, బాపట్ల, రేపల్లె, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం, ఇబ్రహీంపట్నం వైపునకు మళ్లిస్తారు.
చెన్నై నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు మేదరమెట్ల, అద్దంకి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, నార్కెట్పల్లి మీదుగా హైదరాబాద్ వెళ్లాలి. చిలకలూరిపేట నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాలను చిలకలూరిపేట నుంచి ఎన్హెచ్-16 మీద పెదనందిపాడు, కాకుమాను, పొన్నూరు, చందోలు, చెరుకుపల్లి, భట్టిప్రోలు, పెనుమూడి బ్రిడ్జి మీదుగా అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం మళ్లిస్తారు.
చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలను బోయపాలెం క్రాస్ వద్ద నుంచి ఉన్నం గ్రామం ఏబీ పాలెం వల్లూరు, పాండ్రపాడు, పొన్నూరు, చందోలు, చెరుకుపల్లి, భట్టిప్రోలు, పెనుమూడి బ్రిడ్జి మీదుగా అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం మళ్లిస్తారు.
హనుమాన్ జంక్షన్ వైపు నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన వాహనాలను గన్నవరం, ఆగిరిపల్లి, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం వైపు మళ్లిస్తారు.