విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న టిప్పర్..డ్రైవర్ దుర్మరణం
ABN , Publish Date - Dec 18 , 2023 | 01:31 AM
పుల్లూరు వద్ద ఎన్హెచ్-30పై ఆది వారం తెల్లవారుజామున టిప్పర్ విద్యుత్స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు.
మైలవరం రూరల్, డిసెంబరు 17: పుల్లూరు వద్ద ఎన్హెచ్-30పై ఆది వారం తెల్లవారుజామున టిప్పర్ విద్యుత్స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. గుంటూరు జిల్లా నులకపేకకు చెందిన సోదాని కోటేశ్వరరావు(58) టిప్పర్ డ్రైవర్..జి.కొండూరు మండలం పినపాక శివారు కడింపోతవరం వద్ద బూడిదను లోడు చేసుకొని ఖమ్మం జిల్లా ముత్తగూడెంకు వెళుతుండగా పుల్లూరులో వద్ద ఓమలుపులో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వాసుపత్రికి పంపి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.