నూతన విద్యావిధానంతో దేశ ప్రగతికి తోడ్పాటు
ABN , First Publish Date - 2023-06-11T01:06:24+05:30 IST
నూతన విద్యావిధానంతో దేశ ప్రగతికి తోడ్పాటు లభిస్తుందని, అందుకనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉ పాధ్యాయులపై ఉందని కేంద్రీయ విద్యాలయం-2 ప్రిన్సిపాల్ డాక్టర్ పీవీఎ్సఎ్సఆర్ కృష్ణ అన్నారు.
గవర్నర్పేట, జూన్ 10 : నూతన విద్యావిధానంతో దేశ ప్రగతికి తోడ్పాటు లభిస్తుందని, అందుకనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉ పాధ్యాయులపై ఉందని కేంద్రీయ విద్యాలయం-2 ప్రిన్సిపాల్ డాక్టర్ పీవీఎ్సఎ్సఆర్ కృష్ణ అన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న జనభాగిదారీ పక్షోత్సవాల్లో భాగంగా శనివారం కేంద్రీయ విద్యాలయం-1లో నూ తన విద్యా విధానం (2020)పై అవగాహన సదస్సు జరిగింది. సదస్సుకు కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ ఎంవీ రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగిఉన్న సృ జనాత్మకత వెలికితీసేలా విద్యాలయాల్లో కార్యక్రమాలకు రూపకల్పన చేయాలన్నారు. కేంద్రీయ విద్యాలయం-1 ప్రిన్సిపాల్ ఎంవీ రావు మాట్లాడుతూ ఫౌం డేషన్ లిటరసీ అండ్ న్యూమరఫీ గురించి వివరించారు. ఈనెల 15వరకు జన్భాగిదారి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా క్విజ్, పోస్టర్ మేకింగ్, రంగోలి, స్లోగన్ తదితర సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. 40 మందికి పైగా ఉపాధ్యాయులు సదస్సులో పాల్గొని తాము చేపట్టిన విధానాలను వివరించారు.