Share News

65 రైళ్లలో ప్రత్యేక తనిఖీలు

ABN , First Publish Date - 2023-11-20T01:03:57+05:30 IST

దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ రవీన్‌ కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో 65 రైళ్లలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 1983 కేసులు నమోదు చేసి రూ.13.83 లక్షల జరి మానాలు వసూలు చేశారు.

65 రైళ్లలో ప్రత్యేక తనిఖీలు

1983 కేసులు నమోదు.. రూ.13.83 లక్షల జరిమానా వసూలు

రైల్వేస్టేషన్‌, నవంబరు 19: దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ రవీన్‌ కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో 65 రైళ్లలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 1983 కేసులు నమోదు చేసి రూ.13.83 లక్షల జరి మానాలు వసూలు చేశారు. శనివారం దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌ పరిధిలో 112 మంది స్క్వాడ్‌ టీటీఈలు, స్టేషన్‌ సిబ్బంది, కొత్తగా రిక్రూట్‌ అయిన్‌ ప్రొ కమర్షియల్‌ క్లర్క్స్‌, టికెట్‌ కలెక్టర్లు 12 గంటల పాటు 2 స్లాటులుగా తనిఖీలు నిర్వహించారు. 65 రైళ్లలో టికెట్‌ లేని ప్రయాణికులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. విజయవాడ రైల్వేస్టేషన్‌లోనే 620 కేసులు నమోదు చేశారు. ముగ్గురు అనధికార విక్రేతలపై కేసులు నమోదు చేశారు.

Updated Date - 2023-11-20T01:04:01+05:30 IST