జీతాలు పడలేదింకా..

ABN , First Publish Date - 2023-09-04T00:59:54+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపా ధ్యాయుల్లో అందరికీ ఆగస్టు నెల జీతాలు ఇంకా అందలేదు. కృష్ణాజిల్లాలో వివిధ శాఖలకు చెందిన 844 మంది డ్రాయింగ్‌ ఆఫీసర్ల పరిధిలో 13,452 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు ప్రతి నెలా 10లోగా జీతాలు రావడం లేదు.

జీతాలు పడలేదింకా..

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆర్థిక వెతలు

మచిలీపట్నం టౌన్‌, సెప్టెంబరు 3: ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపా ధ్యాయుల్లో అందరికీ ఆగస్టు నెల జీతాలు ఇంకా అందలేదు. కృష్ణాజిల్లాలో వివిధ శాఖలకు చెందిన 844 మంది డ్రాయింగ్‌ ఆఫీసర్ల పరిధిలో 13,452 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు ప్రతి నెలా 10లోగా జీతాలు రావడం లేదు. ఒకటి, రెండు తేదీల్లో పోలీసు, న్యాయశాఖ ఉద్యోగులకు మాత్రమే జీతాలు అందుతున్నాయి. మిగిలిన శాఖల ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు అందక ఆర్థిక ఇబ్బం దులకు గురవుతున్నారు. ఒకటో తేదీన జీతాలు తీసుకుని చాలా కాలమైందని ఉద్యోగులు అంటున్నారు. ఉద్యోగులకు జీతాలు జమయ్యాకే పెన్షనర్లకు అకౌం ట్లలో జమ కావడంలేదు. అన్ని శాఖల ఉద్యోగులకు ఒకేరోజున జీతాలు అంద డం లేదు. దీనిపై పలు ఉద్యోగ సంఘాల నాయకులు తమ వాణిని వినిపించినా ఫలితం శూన్యం.

Updated Date - 2023-09-04T00:59:54+05:30 IST