స్పందన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

ABN , First Publish Date - 2023-02-07T00:39:59+05:30 IST

స్పందనలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరిం చాలని నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ అధికారులను ఆదేశించారు.

స్పందన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌

స్పందన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌

చిట్టినగర్‌, ఫిబ్రవరి 6 : స్పందనలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరిం చాలని నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం స్పందన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంలో నగర పరిధిలోని 18 అర్జీలను కమిషనర్‌ స్వీకరించారు. ఈ సందర్భంలో కమిషనర్‌ మాట్లాడుతూ స్పందనలో వచ్చే అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. మొత్తం 18 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. అదనపు కమిషనర్‌ (జనరల్‌)ఎం. శ్యామల, అదనపు కమిషనర్‌ (ప్రాజెక్ట్స్‌) కె.వి సత్యవతి, చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పి. రత్నావళి, డిప్యూటీ కమిషనర్‌ (రెవెన్యూ) డి. వెంకటలక్ష్మి, జాయింట్‌ డైరెక్టర్‌ (అమృత్‌) డాక్టర్‌ కె.బి.ఎన్‌.ఎస్‌ లతా, సిటీ ప్లానర్‌ జి.వి.జి.ఎస్‌.వి. ప్రసాద్‌, ఎస్‌ఈ నరసింహ మూర్తి, మేనేజర్‌ బి. శ్రీనివాస్‌రావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఫ జోనల్‌ కమిషనర్లు నిర్వహించిన స్పందన కార్యక్రమంలో సర్కిల్‌-3 కార్యాలయంలో ఇంజనీరింగ్‌ విభాగం నుంచి ఒకటి,, సర్కిల్‌-1 కార్యాలయంలో ఇంజనీరింగ్‌ విభాగం నుంచి రెండు అర్జీలు స్వీకరించినట్లు జోనల్‌ కమిషనర్‌ తెలియజేశారు. సర్కిల్‌-2 కార్యాలయంలో ఎటువంటి అర్జీలు స్వీకరించలేదని తెలిపారు.

Updated Date - 2023-02-07T00:40:01+05:30 IST