స్పందన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి
ABN , First Publish Date - 2023-11-21T00:37:17+05:30 IST
స్పందనలో వచ్చే సమస్యల అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు.

స్పందన అర్జీలను
త్వరితగతిన పరిష్కరించాలి
ఫ కమిషనర్ స్వప్నిల్ దినకర్
చిట్టినగర్, నవంబరు 20: స్పందనలో వచ్చే సమస్యల అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్లో స్పందన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. నగరంలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను అర్జీలుగా కమిషనర్కు అందజేశారు. 30 అర్జీలు వచ్చాయని, సమస్యలను ఆయా విభాగాలకు చెందిన అధికారులు క్షేత్రస్థాయిలో త్వరితగతిన పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. అదనపు కమిషనర్ ప్రాజెక్ట్ కేవీ సత్యవతి,ప్రాజెక్ట్ ఆఫీసర్ (యూసీడీ) రోహిణి, చీఫ్ ఇంజనీర్ ఎం.ప్రభాకరరావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.