AP News: రాంకో సిమెంట్ మెయిన్ గేట్ ముందు గిరిజనుల ధర్నా

ABN , First Publish Date - 2023-01-27T10:38:27+05:30 IST

జిల్లాలోని జగ్గయ్యపేట రూరల్ మండల పరిధిలోని రాంకో సిమెంట్ మెయిన్ గేట్ ముందు గిరిజనులు ధర్నాకు దిగారు.

AP News: రాంకో సిమెంట్ మెయిన్ గేట్ ముందు గిరిజనుల ధర్నా

ఎన్టీఆర్: జిల్లాలోని జగ్గయ్యపేట రూరల్ మండల పరిధిలోని రాంకో సిమెంట్ మెయిన్ గేట్ ముందు గిరిజనులు ధర్నాకు దిగారు. స్థానిక గిరిజన మహిళలు కట్టెపుల్లలు ఏరుకునేందుకు వెళ్లగా అక్కడి గార్డులు వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. గార్డుల వైఖరికి నిరసనగా ధర్మారపాడు తండా గ్రామానికి చెందిన గిరిజనులు సిమెంట్ కంపెనీ మెయిన్ గేట్ ముందు న్యాయం చేయాలని ధర్నా చేపట్టారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గార్డుల దాడిలో క్షతగాత్రులైన మహిళను జగ్జయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Updated Date - 2023-01-27T10:38:28+05:30 IST