నాగవంశ కులస్థులను బీసీ-ఏలో చేర్చాలి

ABN , First Publish Date - 2023-06-03T00:56:59+05:30 IST

ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన నాగవంశ కులస్థులను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి చేర్చాలని టీడీపీ నాగవంశ సాధికర సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎరుబోతు రమణారావు కోరారు.

నాగవంశ కులస్థులను బీసీ-ఏలో చేర్చాలి

పాయకాపురం, మే 2 : ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన నాగవంశ కులస్థులను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి చేర్చాలని టీడీపీ నాగవంశ సాధికర సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎరుబోతు రమణారావు కోరారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు చం ద్రబాబును శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో పలువురు నాగవంశ కులస్థు లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా 6 లక్ష ల జనాభా కలిగిన నాగవంశ కులస్థులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారన్నారు. బీసీ-డీలో ఉండటం వలన తమకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందక ఇబ్బందులు పడుతున్నారని, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీ-ఏలో చేర్చాలని కోరగా చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్టు ఎరుబోతు రమణ తెలిపారు. సమితి రా ష్ట్ర నేతలు మొకర ఆదిబాబు, బుగత శ్రీరాములు, బోని నాని, కాళ్ల ఈశ్వ ర్‌, ఎచ్చెర్ల అనిల్‌, రాబిల్లి రాజు, అవనాపు శ్రీను, కనకారావు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:56:59+05:30 IST