మైనార్టీల సంక్షేమం టీడీపీకే సాధ్యం
ABN , First Publish Date - 2023-08-02T00:30:26+05:30 IST
రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి తెలుగుదేశం పార్టీకే సాధ్యమని ఉయ్యూరు నగర పంచాయతీ కోఆప్షన్ మాజీ సభ్యుడు అబ్దుల్ నజీర్ అన్నారు.
ఉయ్యూరు, ఆగస్టు 1 : రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి తెలుగుదేశం పార్టీకే సాధ్యమని ఉయ్యూరు నగర పంచాయతీ కోఆప్షన్ మాజీ సభ్యుడు అబ్దుల్ నజీర్ అన్నారు. స్థానిక 18వ వార్డు 264 బూత్లో మంగళవారం ఓటర్ల జాబితా పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలవాలన్న లక్ష్యంతో వైసీపీ చేస్తున్న కుటిల యత్నాలు తిప్పికొట్టాలన్నారు.