మల్లుపెద్ది రామ సుబ్బయ్య విగ్రహావిష్కరణ

ABN , First Publish Date - 2023-08-22T01:17:32+05:30 IST

కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి అంకితభావంతో పనిచేసిన వ్యక్తి కామ్రేడ్‌ మల్లుపెద్ది రామసుబ్బయ్య అని అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ అధ్యక్షుడు రావుల వెంకయ్య అన్నారు.

 మల్లుపెద్ది రామ సుబ్బయ్య విగ్రహావిష్కరణ

చల్లపల్లి : కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి అంకితభావంతో పనిచేసిన వ్యక్తి కామ్రేడ్‌ మల్లుపెద్ది రామసుబ్బయ్య అని అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ అధ్యక్షుడు రావుల వెంకయ్య అన్నారు. వక్కలగడ్డ సొసైటీ ఆవరణలో సొసైటీ మాజీ అధ్యక్షుడు, కేడీసీసీ మాజీ డైరెక్టర్‌ మల్లుపెద్ది రామసుబ్బయ్య కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యే సింహాద్రి రమే్‌షబాబు, కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌ తాతినేని పద్మావతిలతో కలిసి సోమవారం ఆవిష్కరించారు. ఎమ్మెల్యే సింహాద్రి రమే్‌షబాబు, కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌ తాతినేని పద్మావతి మాట్లాడుతూ, వక్కలగడ్డ సొసైటీ అధ్యక్షుడిగా పని చేసిన రామసుబ్బయ్య, కేడీసీసీ డైరెక్టరుగా పని చేసి సహకార వ్యవస్థ బలోపేతానికి ఎనలేని కృషిచేశారన్నారు. సొసైటీ అధ్యక్షుడు హనుమానుల సురేంద్రనాధ్‌ బెనర్జీ అధ్యక్షతన జరిగిన సభలో సీపీఐ నాయకురాలు అక్కినేని వనజ, జిల్లా కార్యదర్శి టి.తాతయ్య, సర్పంచ్‌ వల్లూరు ఉమా, జడ్పీటీసీ సభ్యురాలు రాజులపాటి కల్యాణి, ఉర్ధూ అకాడమీ డైరెక్టర్‌ నజరానా, ఏఎంసీచైౖర్మన్‌ వేమూరి వెంకట్రావ్‌, గుత్తికొండ రామారావు, పాలడుగు రత్నబాబు, మల్లుపెద్ది బోసు, అట్లూరి వెంకటేశ్వరరావు, మల్లుపెద్ది రత్నకుమారి, రామసుబ్బయ్య కుటుంబ సభ్యులు అజయ్‌కుమార్‌, రాణీకుమారి పాల్గొన్నారు.

Updated Date - 2023-08-22T01:17:32+05:30 IST