దుర్గమ్మను దర్శించుకున్న లోకాయుక్త లక్ష్మణరెడ్డి
ABN , First Publish Date - 2023-02-25T00:50:21+05:30 IST
ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారిని శుక్రవారం ఏపీ లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ్ రెడ్డి దర్శించుకున్నారు.
వన్టౌన్, ఫిబ్రవరి 24: ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారిని శుక్రవారం ఏపీ లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయన కు ప్రొటోకాల్ మర్యాదలు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం ప్రసాదం, ఆశీస్సులు, శేషవస్త్రాన్ని అందించారు.