వారాహి అవతారంలో కాళీమాత

ABN , First Publish Date - 2023-06-26T02:15:35+05:30 IST

ఆలయం స్థాపించిన తర్వాత తొలిసారిగా ఆషాఢ మాసం సందర్భంగా ఆది, సోమ, మంగళవారాల్లో త్రిశక్తిపీఠంలోని కాళీమాతను వారాహిదేవి అవతారంలో అలంకరిస్తున్నామని ఆలయ కమిటీ కార్యదర్శి కొప్పురావూరి జగదీష్‌, ఆలయ ఆధ్మాత్మిక సలహాదారు భారతుల విజయ్‌కిరణ్‌ తెలిపారు.

వారాహి అవతారంలో కాళీమాత
అమ్మవారికి ఆషాఢ సారె తెచ్చిన శ్రీ కనకదుర్గ లలిత పారాయణ బృందం

కృష్ణలంక, జూన్‌ 25: ఆలయం స్థాపించిన తర్వాత తొలిసారిగా ఆషాఢ మాసం సందర్భంగా ఆది, సోమ, మంగళవారాల్లో త్రిశక్తిపీఠంలోని కాళీమాతను వారాహిదేవి అవతారంలో అలంకరిస్తున్నామని ఆలయ కమిటీ కార్యదర్శి కొప్పురావూరి జగదీష్‌, ఆలయ ఆధ్మాత్మిక సలహాదారు భారతుల విజయ్‌కిరణ్‌ తెలిపారు. ఆషాఢం సందర్భంగా అమ్మవారికి మహిళలు భారీగా బోనాలు సమర్పిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఆదివారం కనకదుర్గ లలిత పారాయణ బృందం సభ్యులు అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించారని వారు పేర్కొన్నారు.

Updated Date - 2023-06-26T02:15:35+05:30 IST