రీ డెవలప్మెంట్కు గుడివాడ రైల్వేస్టేషన్
ABN , First Publish Date - 2023-06-03T00:52:15+05:30 IST
విజయవాడ డివిజన్ పరిధిలో 16 రైల్వేస్టేషన్లను రీ డెవల ప్మెంట్ చేసేందుకు రైల్వేబోర్డు నిర ్ణయించింది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ డివిజన్ పరిధిలో 16 రైల్వేస్టేషన్లను రీ డెవల ప్మెంట్ చేసేందుకు రైల్వేబోర్డు నిర ్ణయించింది. ఇప్పటికే విజయవాడ ఏ1 రైల్వేస్టేషన్ రీ డెవలప్ మెంట్కు డిజైన్ల రూపకల్పన జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇవికాకుండా ఏ, బీ కేటగిరీల్లోని మరో 16 రైల్వేస్టేషన్లను కూడా రీ డెవలప్మెంట్కు ఎంపిక చేశారు. వీటిలో రాజమండ్రి, సామర్లకోట, ఒంగోలు, గూడూరు, కాకినాడ, తెనాలి, ఏలూరు, భీమవరం టౌన్, అనకాపల్లి, తాడేపల్లిగూడెం, చీరాల, తుని, నరసాపూర్, గుడివాడ, కోటిపల్లి రైల్వేస్టేషన్లు ఉన్నాయి. రైల్వేస్టేషన్ల రీ డెవలప్ మెంట్లో భాగంగా రైల్వేస్టేషన్లలో నూతన భవ నాలు నిర్మించటం, ప్లాట్ఫాంలను అభివృద్ధి చేయటం, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించటం, టికెట్ బుకింగ్ కౌంటర్లు, ప్లాట్ఫాంలలో సీటింగ్, ఎల్ఈడీ లైటింగ్, ఎల్సీడీ డిస్ప్లేలు, కార్, మోటార్ సైకిల్ పార్కింగ్లు వంటివి కల్పించటంతో పాటు ప్రయా ణికులకు అత్యాధునికమైన సౌకర్యాలు కల్పిస్తారు.