ధాన్యం సొమ్ము చెల్లించాలి

ABN , First Publish Date - 2023-03-26T00:43:23+05:30 IST

ఆర్బీకేల్లో విక్రయించిన ధాన్యానికి నగదును చెల్లించాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో కొత్తపల్లి రైతులు శనివారం ఏవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

ధాన్యం సొమ్ము చెల్లించాలి
వినతిపత్రం అందజేస్తున్న రైతు సంఘ నాయకులు

గంపలగూడెం, మార్చి 25: ఆర్బీకేల్లో విక్రయించిన ధాన్యానికి నగదును చెల్లించాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో కొత్తపల్లి రైతులు శనివారం ఏవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కొత్తపల్లిలో రైతులు ధాన్యాన్ని నాలుగు మాసాల క్రితం ఆర్బీకేలో 10లారీలు రూ.52 లక్షలకు ధాన్యాన్ని విక్రయించారు. దానికి సంబంధించిన నగదు నేటికి చెల్లించలేదన్నారు. కార్యక్రమంలో రైతుసంఘ నాయకులు జి.సీతారామిరెడ్డి, జి.వీరారెడ్డి, జి.అప్పిరెడ్డి, లేళ్ల భాస్కరరెడ్డి, వంగల నాగేశ్వరరావు, కుప్పాల మోహన్‌రావు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T00:43:23+05:30 IST