ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
ABN , First Publish Date - 2023-01-26T01:42:29+05:30 IST
చిన్న తరహా పరిశ్రమలు స్థాపించే ఔత్సా హిక పారిశ్రామికవేత్తలను అనేక సబ్సిడీలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహి స్తోందని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు.
పటమట, జనవరి 25: చిన్న తరహా పరిశ్రమలు స్థాపించే ఔత్సా హిక పారిశ్రామికవేత్తలను అనేక సబ్సిడీలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహి స్తోందని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. బుధవారం పట మట వేదిక కల్యాణ మండపంలో ఎంఎస్ఎంఈ చాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన మెగాలోన్ మేళాను ఆయన ప్రారంభించారు. మేళాలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులతో పాటు కో-ఆపరేటివ్ బ్యాంకర్లు స్టాల్స్ ఏర్పాటు చేశారు. స్వయం ఉపాధి సంఘాలు, చిన్న, మధ్య తరహా పారిశ్రా మికవేత్తలు పెద్ద సంఖ్యలో హాజరై లోన్మేళాను వినియోగించుకున్నారు. ఎంఎస్ఎంఈ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ దేవరాజు, డైరెక్టర్ కిరణ్కు మార్, బ్యాంకర్లు పాల్గొన్నారు.