రక్తదానంపై అపోహలు వద్దు
ABN , Publish Date - Dec 17 , 2023 | 12:46 AM
పటమట, డిసెంబరు 16 : రక్తదానం గురించి అపోహలు పనికిరావని, ఆరోగ్యవంతులు రక్తదానం చేయడం వలన ఆరోగ్యం మరింత మెరుగవుతుం దని ప్రముఖ ఇమ్యునో హిమటాలజిస్ట్ డాక్టర్ ఎన్. తులసీరామ్ అన్నారు.
మాట్లాడుతున్న డాక్టర్ ఎన్. తులసీరామ్
రక్తదానంపై అపోహలు వద్దు
డాక్టర్ ఎన్. తులసీరామ్
పటమట, డిసెంబరు 16 : రక్తదానం గురించి అపోహలు పనికిరావని, ఆరోగ్యవంతులు రక్తదానం చేయడం వలన ఆరోగ్యం మరింత మెరుగవుతుం దని ప్రముఖ ఇమ్యునో హిమటాలజిస్ట్ డాక్టర్ ఎన్. తులసీరామ్ అన్నారు. వాసవ్య నర్సింగ్ హోమ్లో డాక్టర్ సమరం అధ్యక్షతన జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని రక్తం, రక్తం మార్పిడి అనే అంశంపై సవివరంగా ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ ఆధునిక యుగంలో రక్తసేకరణ, నిల్వలో అత్యాధునిక పరిస్థితులు ఆవిర్భవించాయని అన్నారు. బ్లడ్ బ్యాంక్లలో నేట్ టెస్ట్ ద్వారా ప్రమాదకరమైన వైరల్ ఇన్ఫెక్షన్లని కూడా సునాయాసంగా గుర్తించడం జరుగుతుందని అన్నారు. డాక్టర్ మారు వందన సమర్పణ చేశారు.