విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2023-08-11T02:10:49+05:30 IST

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్‌ పి.రాజాబాబు అన్నారు.

  విద్యార్థుల ఆరోగ్యంపై   ప్రత్యేక శ్రద్ధ వహించాలి : కలెక్టర్‌
నులిపురుగుల నివారణ మందు వేస్తున్న కలెక్టర్‌ రాజాబాబు

మచిలీపట్నం టౌన్‌, ఆగస్టు 10 : విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్‌ పి.రాజాబాబు అన్నారు. జాతీ య నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని చిలకలపూడి మునిసిపల్‌ నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాలలో గురువారం ఆయన ప్రారంభించారు. విద్యార్థులకు నులిపురుగుల నివారణ మందులు పంపిణీ చేశారు. డీఈవో తాహెరా సుల్తానా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ గీతాబాయి, కార్పొరేటర్‌ రాసంశెట్టి వాణిశ్రీ, డీవైఈవో యువి సుబ్బారావు, ప్రఽధానోపాధ్యాయుడు కృష్ణమూర్తి పాల్గొన్నారు.

Updated Date - 2023-08-11T02:10:49+05:30 IST