తిరుపతమ్మ ఆలయంలో భక్తుల సందడి
ABN , First Publish Date - 2023-06-03T01:15:48+05:30 IST
తిరుపతమ్మ అమ్మవారిని తెలుగు రాష్ట్రాల భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
పెనుగంచిప్రోలు, జూన్ 2: తిరుపతమ్మ అమ్మవారిని తెలుగు రాష్ట్రాల భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కొరియోగ్రాఫర్ శేఖర్ కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్శిం చుకున్నారు. దర్శనం అనంతరం ఆయనకు ఆలయ అర్చకులు, వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదాలను అధికారులు అందించారు.
అమ్మవారి సేవలో దేవదాయ శాఖ స్తపతి పరమేశ్వరప్ప
తిరుపతమ్మ అమ్మవారిని దేవదాయశాఖ స్తపతి పి.పరమేశ్వరప్ప దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పరమేశ్వరప్పకు అర్చకులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయంలో అభివృద్ధి పనులను పరిశీలించి ఇంజనీరింగ్ అధికారులకు పరమేశ్వరప్ప పలు సూచనలు చేశారు. చైర్మన్ ఇంజం చెన్నకేశవరావు, డిప్యూటీ కలెక్టర్, ఈవో రమేష్నాయుడు, ఈఈ వైకుంటరావు, ఏఈ రాజు తదితరులు ఆయన వెంట ఉన్నారు.