Share News

ఆర్టీసీ కార్మికుల ఆందోళన

ABN , First Publish Date - 2023-10-30T00:25:30+05:30 IST

కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌ రాంసింగ్‌పై జరిగిన దాడని ఖండిస్తు ఆర్టీసీ డిపొలో కార్మికసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం నిర సన కార్యక్రమం నిర్వహించారు.

 ఆర్టీసీ కార్మికుల ఆందోళన
జేఏసీ నిరసన

తిరువూరు, అక్టోబరు 29: కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌ రాంసింగ్‌పై జరిగిన దాడని ఖండిస్తు ఆర్టీసీ డిపొలో కార్మికసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం నిర సన కార్యక్రమం నిర్వహించారు. నల్లబ్యార్జీలుఽ ధరించి నిరసనలో పాల్గొన్నారు. దాడికి పాల్పడిన దోషుల్ని గుర్తించి కఠినంగా శిక్షించాలని నాయకులు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు రామకృష్ణ, పి.కె.రెడ్డి, ఎ.వి.రెడ్డి, ఎం.వి.కె.రావు, కె.ఎ.వి.ప్రసాద్‌, స్టాలిన్‌, జక్కా సాంబశివరావు, ఎన్‌.వి.ఆర్‌.బాబు, స్వామి పాల్గొన్నారు.

Updated Date - 2023-10-30T00:25:30+05:30 IST