వర్షంతో మిర్చి రైతులు బెంబేలు
ABN , First Publish Date - 2023-03-26T00:47:28+05:30 IST
పెనుగంచిప్రోలులో శనివారం కురిసిన వర్షానికి మిర్చి రైతులకు తీరని నష్టం వాటిల్లింది.
పెనుగంచిప్రోలు : పెనుగంచిప్రోలులో శనివారం కురిసిన వర్షానికి మిర్చి రైతులకు తీరని నష్టం వాటిల్లింది.మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఒక్కసారిగా వర్షం రావ డంతో పొలాల్లో నీళ్లు పారాయి. కోసిన మిరపకాయలు సైతం బస్తాల్లో పట్టినా వర్షం ఉధృతంగా రావడంతో బస్తాల్లో ఉన్న మిర్చి కూడా తడిసిపోయింది. తడిసిన మిర్చి బస్తాలను నానా తంటాలు పడి రైతులు కూలీల సాయంతో తరలించి కల్లాల్లో ఆరబోస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు వర్షం పడటంతో తమకు తీరని నష్టం కల్గిందని రైతులు వాపోతున్నారు.