Share News

ఘనంగా ముగిసిన బాలల హక్కుల వారోత్సవాలు

ABN , First Publish Date - 2023-11-21T00:41:00+05:30 IST

కబేళా సమీపంలోని ప్రభుత్వ బాలుర పరిశీలనా గృహంలో బాల ల హక్కుల వారోత్సవాల ముగింపు వేడుకలు సోమవారం నిర్వహిం చారు.

ఘనంగా ముగిసిన బాలల హక్కుల వారోత్సవాలు
మాట్లాడుతున్న జువెనైల్‌ శాఖడైరెక్టర్‌ ప్రసాదమూర్తి

ఘనంగా ముగిసిన బాలల హక్కుల వారోత్సవాలు

భవానీపురం, నవంబరు 20 : కబేళా సమీపంలోని ప్రభుత్వ బాలుర పరిశీలనా గృహంలో బాల ల హక్కుల వారోత్సవాల ముగింపు వేడుకలు సోమవారం నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జువెనైల్‌ వెల్ఫేర్‌ డిపార్టు మెంట్‌ డైరెక్టర్‌ బీడీవీ.ప్రసాదమూర్తి, గౌరవ అతిథులుగా సత్యానంద యోగాశ్రమానికి చెందిన స్వామి భక్తి చైతన్యానంద సరస్వతి, చీఫ్‌ ప్రొబేషన్‌ సూపరింటెండెంట్‌ టి. మధుసూదన రావులు హాజరయ్యారు. వారం రోజుల పాటు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రధానం చేశారు. ఆంధ్ర హాస్పిటల్‌కు చెందిన డాక్టర్‌ వినోద్‌ పిల్లలకు ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ క్లాసులు నిర్వహించి వారికి సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. హోం సూపరింటెండెంట్‌ పి. రామ్మోహన్‌రెడ్డి, గుంటూరు జిల్లా జువెనైల్‌ జస్టిస్‌ ప్యానెల్‌ లాయర్‌ మహాలక్ష్మి, ప్రొబేషన్‌ అధికారి హాసన్‌ ఆలీ బేగ్‌లు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-21T00:41:02+05:30 IST