చంద్రబాబుతోనే గ్రామాల అభివృద్ధి
ABN , First Publish Date - 2023-11-20T00:42:31+05:30 IST
రాష్ట్రాభివృద్ధితో పాటు పేదలకు సంక్షేమం, యువ తకు బంగారు భవిష్యత్తు అందించడం చంద్రబా బునాయుడుతోనే సాధ్యమని టీడీపీ అధ్యక్షుడు కొండపల్లి వెంకటేశ్వరరావు, జనసేన అధ్యక్షుడు గరికపాటి నాగబాబు అన్నారు.

హనుమాన్జంక్షన్రూరల్, నవంబరు 19 : రాష్ట్రాభివృద్ధితో పాటు పేదలకు సంక్షేమం, యువ తకు బంగారు భవిష్యత్తు అందించడం చంద్రబా బునాయుడుతోనే సాధ్యమని టీడీపీ అధ్యక్షుడు కొండపల్లి వెంకటేశ్వరరావు, జనసేన అధ్యక్షుడు గరికపాటి నాగబాబు అన్నారు. కోడూరుపాడులో టీడీపీ, జనసేన గ్రామ కమిటీల ఆధ్వర్యంలో ఆది వారం బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. మహిళలతో కలసి గ్రామ వీధుల్లో పర్యటిస్తూ టీడీపీ ప్రభుత్వంలో ఒక్కోకుటుంబానికి ఎంత లబ్ధి చేకూరనుందో తెలియజేసే భవిష్యత్తు గ్యారెంటీ బాండ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి వెంకటేశ్వరరావు, గరికపాటి నాగబాబు, ఆర్నేపల్లి సూరిబాబు, పూర్ణచందర్, ఆర్నేపల్లి వెంకటేశ్వ రరావు, యేసుబాబు, గాజుల సునీత, షేక్ సాల్మన్, రుక్మిణి, తదితరులతో పాటు టీడీపీ. జనసేన కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.