చదువుతోనే అభ్యున్నతి సాధ్యం
ABN , Publish Date - Dec 18 , 2023 | 12:23 AM
చదువుతోనే అభ్యున్నతి సాధ్యమని రిటైర్డు ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్రావు అన్నారు. ఆదివారం హనుమాన్జంక్షన్లో జరిగిన కాపు వనసమారాధన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మానవత స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు మారుబోయిన కోటేశ్వర రావు అధ్యక్షతన జరిగిన సభలో ప్రభాకర్రావు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు తమ పిల్లల్ని బాగా చదివించే విధంగా ఆలోచించాలని కోరారు.
హనుమాన్జంక్షన్, డిసెంబరు 17: చదువుతోనే అభ్యున్నతి సాధ్యమని రిటైర్డు ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్రావు అన్నారు. ఆదివారం హనుమాన్జంక్షన్లో జరిగిన కాపు వనసమారాధన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మానవత స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు మారుబోయిన కోటేశ్వర రావు అధ్యక్షతన జరిగిన సభలో ప్రభాకర్రావు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు తమ పిల్లల్ని బాగా చదివించే విధంగా ఆలోచించాలని కోరారు. సినీ నటుడు వడ్డి మహేష్ మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవి ప్రోత్సాహంతో తన నట జీవితం బిజీగా సాగుతుందన్నారు. కాపు సామాజిక వర్గం జనాభాలో అధిక సంఖ్యలో ఉన్నారని సమైఖ్యతతో ఉన్నపుడే రాజ్యాధికారం సాధించగలమన్నారు. తెలగ, బలిజ, తూర్పుకాపు దక్షిణ భారత జేఏసీ కన్వీనర్ దాసరి రాము, వైసీపీ నేత దుట్టా రామ చంద్రరావు, ప్రముఖ పారిశ్రామికవేత్త బండారు నరసింహారావు తదితరులు ప్రసం గించారు. కాపు వన సమారాధన నిర్వాహక కమిటీ చైర్మన్ దుట్టా శివన్నారాయణ, శేరీనరసన్నపాలెం సర్పంచ్ అడపా అంజిబాబు, భారతి విద్యా భవన్ ప్రిన్సిపాల్ కేతినీడి జైనేంద్ర తదితరులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.