Bishwabhushan Harichandan: జమున మృతిపట్ల ఏపీ గవర్నర్ దిగ్భ్రాంతి

ABN , First Publish Date - 2023-01-27T14:43:53+05:30 IST

సినీనటి, మాజీ ఎంపీ జమున మృతి పట్ల రాష్ట్ర గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Bishwabhushan Harichandan: జమున మృతిపట్ల ఏపీ గవర్నర్ దిగ్భ్రాంతి

అమరావతి: సినీనటి, మాజీ ఎంపీ జమున (Actress Jamuna)మృతి పట్ల రాష్ట్ర గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ (Governor Bishwabhushan Harichandan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిసమ్మ, గుండమ్మకథ, దొంగరాముడు, మూగ మనస్సులు వంటి గోప్పసినిమాల్లో జమున కథానాయకిగా నటించి మెప్పించారన్నారు. రాజమండ్రి నుంచి పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికై సేవ చేశారని అన్నారు. సినీరంగంలో అనేక అవార్డులను సొంతం చేసుకున్నారని తెలిపారు. జమున కుటుంబానికి గవర్నర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Updated Date - 2023-01-27T14:43:54+05:30 IST