చెవిలో గులాబీలతో అంగన్వాడీల నిరసన
ABN , Publish Date - Dec 18 , 2023 | 01:33 AM
నందిగామలో అంగ న్వాడీ కార్యకర్తలు చెవిలో గులాబీ పూలు పెట్టుకుని నిరసన తెలిపారు.
నందిగామ రూరల్: ‘‘పాదయాత్రలో అంగన్వాడీలు తనకు అక్కచెల్లెళ్లని, ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని చేసిన వాగ్దానాన్ని ముఖ్య మంతి జగన్మోహన్రెడ్డి మరిచిపోయారు. సమస్యల పరి ష్కారం కోసం నిరసన తెలుపుతున్న అంగన్వా డీలపై ఆయన ఏమాత్రం కనికరం చూపడం లేదు. ఆయన నియమించుకున్న సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో దొడ్డిదారిన రాత్రి సమయాల్లో అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలకొట్టిస్తున్నారు’’. అని సీఐటీయూ నాయ కుడు కటారపు గోపాల్, పలువురు అం గన్వాడీ కార్య కర్తలు విమర్శించారు. తమ డిమాండ్లు ఆమోదించాలని అంగన్వాడీ కార్యకర్తలు, హెల్ప ర్లు చేస్తున్న ఆందోళన ఆదివారం ఆరోరోజుకు చేరింది. నందిగామలో అంగ న్వాడీ కార్యకర్తలు చెవిలో గులాబీ పూలు పెట్టుకుని నిరసన తెలిపారు.