టీడీపీ పథకాలతో వైసీపీకి ఓటమి భయం

ABN , First Publish Date - 2023-06-01T00:00:32+05:30 IST

మహానాడు సందర్బంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోతో వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని మాజీ ఎమ్మెల్యే షాజ హాన బాషా తెలిపారు.

టీడీపీ పథకాలతో వైసీపీకి ఓటమి భయం
కార్యకర్తల తో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే షాజహానబాషా

నిమ్మనపల్లె, మే 31: మహానాడు సందర్బంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోతో వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని మాజీ ఎమ్మెల్యే షాజ హాన బాషా తెలిపారు. బుధవారం స్థానిక బస్టాండులో కార్యకర్తలతో నిర్వహించిన సమా వేశంలో ఆయన మాట్లాడుతూ మహిళా సంక్షే మమే ధ్యేయంగా మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు అద్బుతమైన పథకాలను ప్రక టించాడన్నారు. ఈ పథకాలతో వైసీపీకి షాక్‌ తగిలిందని దీంతో ఏం మాట్లాడాలో వారిక తెలియడంలేదన్నారు. వైసీపీ సర్కార్‌ గద్దెనెక్కి నాలుగేళ్లు పూర్తయినా ఇప్పటివరకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకుం టామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ రెడెప్ప రాజన్న, శ్రీ పతి, జయన్న, ధారా రెడ్డెప్ప, రాజన్న, తదితరులు పాల్గొన్నారు.

రామసముద్రం: రామసముద్రంలో టీడీపీ మినీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించి రాబో యే ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు కృషి చేయాలని కోరారు. ప్రతీప్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడు, ఎల్‌.శివ, టీస్టాల్‌ కిట్టా, కృష్ణప్ప, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-01T00:00:32+05:30 IST