‘ఉర్దూ మీడియం ప్లస్2 కళాశాలలను ఏర్పాటు చేయాలి’
ABN , First Publish Date - 2023-05-31T23:44:57+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా ఉర్దూ మీడియం ప్లస్2 కళాశాలలను ఏర్పాటు చేయాలని రూటా వ్యవస్థాపక అధ్యక్షుడు సయ్యద్ హిదయతుల్లా, రూటా ప్రధాన కార్యదర్శి స య్యద్ ఇక్బాల్ డిమాండ్ చేశారు.
కడప (ఎడ్యుకేషన్), మే 31 : రాష్ట్ర వ్యాప్తంగా ఉర్దూ మీడియం ప్లస్2 కళాశాలలను ఏర్పాటు చేయాలని రూటా వ్యవస్థాపక అధ్యక్షుడు సయ్యద్ హిదయతుల్లా, రూటా ప్రధాన కార్యదర్శి స య్యద్ ఇక్బాల్ డిమాండ్ చేశారు. బుధవారం ఉప ముఖ్యమంత్రి అంజద్బాషాకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే ఏర్పాటు చేసిన 292 ఇంగ్లీషు ప్లస్2 కళాకారులల్లో మైనార్టీ విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉర్దూ పీజీటీ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రూటా రాష్ట్ర సమన్వయ కర్త మహ్మద్ ఆయుబ్, అసోసియేట్ అధ్యక్షుడు షాహిదుల్లా, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి అష్రఫుల్లాబాషా, జిల్లా అధ్యక్షుడు మహ్మద్ ఇర్షాద్, డైరీ కమిటి ఛైర్మన్ అబ్దుల్ హకీం, కో చైర్మన్ సయ్యద్ సిరాజుద్ద్దీన్తో పాటు పలువురు పాల్గొన్నారు.