మల్లూరువారిపల్లె వద్ద గుర్తు తెలియని శవం
ABN , First Publish Date - 2023-03-30T22:45:02+05:30 IST
మదనపల్లె - కదిరి ఫ్లైఓవర్ కింద రైల్వే ట్రాక్ దగ్గర కాల్వలో గుర్తు తెలియని శవం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శవం పడిఉన్న స్థితిని చూస్తే నాలుగైదు రోజుల కిదంట అతడు మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. వివరాల్లోకెళితే....
బి.కొత్తకోట మార్చి 30: మదనపల్లె - కదిరి ఫ్లైఓవర్ కింద రైల్వే ట్రాక్ దగ్గర కాల్వలో గుర్తు తెలియని శవం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శవం పడిఉన్న స్థితిని చూస్తే నాలుగైదు రోజుల కిదంట అతడు మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. వివరాల్లోకెళితే....
తుమ్మనగుట్ట పంచాయతీ మల్లూరివారిపల్లె వద్ద ట్రాక్ దగ్గర కాల్వలో గుర్తు తెలియ ని శవం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. సుమారు 60 ఏళ్లు ఉండవచ్చని తాగిన మైకంలో మోరీ మీద నుంచి కాల్వలోకి పడి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచ నా వేస్తున్నారు.
మృతుడు బ్లూ, వైట్, ఆరెంజ్, నిలువు, అడ్డగీతలు కలిగిన హాఫ్ షర్ట్ ధరించి ఉన్నాడు. వంగపూత కలర్ పుల్ డ్రాయర్, నలుపు, బ్లూ, వైట్, నిలువ అడ్డ గీత లున్న లుంగీ ధరించి ఉన్నాడు. ఎవరైనా ఇలాంటి వ్యక్తి వివరాలు సరి చూసుకోవాలని పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని శవం పడి ఉన్నట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు.