జగన్కు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే ఈ ఖర్మ
ABN , First Publish Date - 2023-02-06T23:58:11+05:30 IST
వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే మన రాష్ట్రానికి ఈ ఖర్మ పట్టిందని రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే రమేశ్కుమార్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం రాయచోటి పట్టణంలోని 14వ వార్డులో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన ‘ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే రమేశ్కుమార్రెడ్డి
రాయచోటిటౌన్, ఫిబ్రవరి 6: వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే మన రాష్ట్రానికి ఈ ఖర్మ పట్టిందని రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే రమేశ్కుమార్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం రాయచోటి పట్టణంలోని 14వ వార్డులో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన ‘ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని వీధుల్లో తిరుగుతూ రచ్చబండ కార్యక్రమం నిర్వహించి జగన్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. మూడున్నరేళ్లుగా ఏం ఘనకార్యం చేశారని, గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రజల ముందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ర్టానికి ఒక్క పరిశ్రమను తీసుకురాకపోగా టీడీపీలో తీసుకొచ్చిన పరిశ్రమను తుగ్లక్ నిర్ణయాలతో వెళ్లగొడుతున్నారని ఆరోపించారు. 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయమని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్బాషా, పట్టణ అధ్యక్షుడు బోనమల ఖాదర్వలి, రూరల్ అధ్యక్షుడు వెంకటసుబ్బారెడ్డి, పట్టణ మైనార్టీ అధ్యక్షుడు అతావుల్లా, టీడీపీ నాయకులు మన్సూర్, సోనీరాజ్, కలీమ్, పట్టణ ఉపాధ్యక్షుడు రెహమాన్, మహబూబ్ అలీఖాన్, అత్తర్జావీద్, శ్రీనివాసులు, రాజంపేట ఎస్టీ సెల్ అధ్యక్షుడు రెడ్డెయ్య, తదితరులు పాల్గొన్నారు.