మహిళా సంరక్షణ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2023-03-30T23:30:09+05:30 IST
గ్రామ వార్డు సచివాయాల్లో పనిచేస్తున్న మహిళా సంరక్షణ కార్య దర్శులు విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని గ్రామ వార్ఢు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు.
ప్రొద్దుటూరు అర్బన్, మార్చి 30: గ్రామ వార్డు సచివాయాల్లో పనిచేస్తున్న మహిళా సంరక్షణ కార్య దర్శులు విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని గ్రామ వార్ఢు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ గ్రామవార్డు సచివాయాలలో పనిచేసే ప్రతి కార్యదర్శి 3 నుంచి 5 గంటలు సచివాలయల్లో వుండాలని ప్రభుత్వం సర్కులర్ జారీ చేసిందన్నారు. కానీ ఇదే సమయం లో మహిళా కార్యదర్శులకు పోలీసు స్టేషనలలో రిసెప్షన్ విధులు, పెట్రోలింగ్ విధులను నిర్వహించా లని ఒత్తిడి చేయడం తగదన్నారు.