మత్తు పదార్థాల ఆలోచనే పెద్ద ప్రమాదం
ABN , First Publish Date - 2023-03-25T22:35:46+05:30 IST
ఆదర్శవంత ప్రవర్తన, విద్యార్థు ల ఉజ్వల భవిష్యత్తు, దేశ ఔన్నత్యానికి బాటలు వేస్తుందని వైవీయూ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ క్రిష్ణారెడ్డి తెలిపారు.
వైవీయూ ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి
కడప (ఎడ్యుకేషన్), మార్చి 25: ఆదర్శవంత ప్రవర్తన, విద్యార్థు ల ఉజ్వల భవిష్యత్తు, దేశ ఔన్నత్యానికి బాటలు వేస్తుందని వైవీయూ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ క్రిష్ణారెడ్డి తెలిపారు. భారత ప్రభుత్వ సామాజిక న్యాయ, మం త్రిత్వ శాఖ మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణ జాతీ య రాష్ట్ర కార్యాచరణలో భాగం గా వైవీయూ ఎన్ఎ్సఎస్, జిల్లా విభిన్న ప్రతిభావంతుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సత్ప్రవర్తన, ఉన్నత వ్యక్తిత్వం కలవారని, అందువల్లనే డ్రగ్ ఫ్రీ విశ్వవిద్యాలయంగా వైవీయూ ఉందన్నారు.
స్పెషల్ ఎన్ఫర్మెంట్ బ్యూరో సూపరింటెండెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ డ్రగ్ ఫ్రీ కడప కావాలని ఆకాంక్షించారు. మత్తు పదార్థాలతో జరిగే నష్టం తెలిసి కూడా బానిస కావడం మూర్ఖత్వమన్నారు. సమగ్ర శిక్ష జిల్లా పథక అధికారి ప్రభాకర్రెడ్డి, రిమ్స్ సైకియాటిక్ అసోసియేట్ ప్రొఫెసర్ ఆర్.వెంకటరాముడు, వైవీయూ ఎన్ఎ్సఎస్ సమన్వ య కర్త డాక్టర్ వెంకటరామిరెడ్డి, ఎన్ఎ్సఎస్ పీఓలు చంద్రశేఖర్, డాక్టర్ గోవర్థన్రెడ్డి, ప్రొఫెసర్ డాక్టర్ వి.లాజర్, అధ్యాపకులు పాల్గొన్నారు.