Share News

సంక్షేమం, అభివృద్ధి కోసం టీడీపీని గెలిపించాలి

ABN , Publish Date - Dec 28 , 2023 | 12:18 AM

పేదలందరికీ వివి ధ రకాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల కోసం టీడీపీని ఆదరించి గెలిపించాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి కోరారు.

సంక్షేమం, అభివృద్ధి కోసం టీడీపీని గెలిపించాలి
గ్యారంటీ పథకాల కరపత్రాలు అందజేస్తున్న కిశోర్‌కుమార్‌ రెడ్డి

కలికిరి, డిసెంబరు 27: పేదలందరికీ వివి ధ రకాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల కోసం టీడీపీని ఆదరించి గెలిపించాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి కోరారు. పదేళ్ల నుంచి నియోజకవర్గంలో అభివృద్ధి పడకేసిందని, వేలాది మంది యు వకులు ఉద్యోగాలు లేక అల్లాడుతున్నారని ఆయన చెప్పారు. బుధవారం ఆయన మేడికుర్తి పంచాయతీలోని దళితవాడ, కుమ్మరప ల్లె, మేడికుర్తి, ఆసాదిపల్లె, ఎద్దులవారిపల్లె గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలను పంచిపెట్టారు. అఽధికార పార్టీ నాయకులు మాత్రం ఇసుక, మట్టి, మద్యం అమ్మకాలతో రూ.కోట్లు గడించారని విమర్శించారు. వైసీపీకి బుద్ది చెప్పకపోతే రాష్ట్ర భవిష్యత్తు కకావికలం కావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో కలికిరి సర్పంచ ప్రతాప్‌కుమార్‌ రెడ్డి, పార్లమెంటు ఉపాధ్యక్షుడు వాసునూరి చంద్రశేఖర్‌, మండ ల టీడీపీ అధ్యక్షుడు నిజాముద్దీన, మేడికుర్తి మాజీ సర్పంచ మహ్మద్‌ గౌస్‌, మహబూబ్‌ బాషా, సురేష్‌కుమార్‌రెడ్డి, జనార్ధన గౌడ్‌, శ్రీరామిరెడ్డి, మధుసూదన రెడ్డి, మునుస్వామి, సద్దాం, గంగరాజు, సిద్దయ్య, పూర్ణచంద్ర, వేణు, సహదేవరెడ్డి, వెంకటనారాయణ రెడ్డి, సుధాకర్‌రెడ్డి, ఆనందరెడ్డి, ఎద్దుల శీన, మదన తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2023 | 12:18 AM