కష్టపడి పనిచేసే వారికి అండగా ఉంటా

ABN , First Publish Date - 2023-02-01T23:25:25+05:30 IST

కష్టపడి పనిచేసే వారికి అండగా ఉంటానని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి రమేశ్‌కుమార్‌రెడ్డి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలువా, బొకేలతో సత్కరించారు.

కష్టపడి పనిచేసే వారికి అండగా ఉంటా
చంద్రబాబునాయుడుతో చర్చిస్తున్న మాజీ ఎమ్మెల్యే రమేశ్‌కుమార్‌రెడ్డి

మాజీ సీఎం చంద్రబాబునాయుడు

రాయచోటిటౌన్‌, ఫిబ్రవరి 1: కష్టపడి పనిచేసే వారికి అండగా ఉంటానని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి రమేశ్‌కుమార్‌రెడ్డి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలువా, బొకేలతో సత్కరించారు. అనంతరం రమేశ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గ పరిస్థితులపై వివరించారు. అదేవిధంగా ‘ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి’ కార్యక్రమం విజయవంతంపై, ప్రజల నుంచి వస్తున్న స్పందనను తెలిపారు. దీంతో చంద్రబాబునాయుడు రమేశ్‌కుమార్‌రెడ్డిని అభినందించారు. పార్టీ కోసం పనిచేయండి.. మీకు అండగా నేను ఉంటా అని భరోసా ఇచ్చారు. ఆయన వెంట టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా, తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-02-01T23:25:26+05:30 IST