సీనియర్ ఫుట్బాల్ మహిళా జట్టు ఎంపిక
ABN , First Publish Date - 2023-03-02T23:35:10+05:30 IST
విశాఖపట్టణంలో ఈ నెల 6 నుంచి జరగనున్న రాష్ట్రస్థాయి మహిళల ఫుట్బాల్ టోర్నమెంటుకు జిల్లా ఫుట్బాల్ జట్టును ఎంపిక చేశారు.
కడప (స్పోర్ట్స్), మార్చి 2: విశాఖపట్టణంలో ఈ నెల 6 నుంచి జరగనున్న రాష్ట్రస్థాయి మహిళల ఫుట్బాల్ టోర్నమెంటుకు జిల్లా ఫుట్బాల్ జట్టును ఎంపిక చేశారు. స్థానిక విద్యుత్ భవన్లో గల క్రీడామైదానంలో గురువారం జిల్లా ఫుట్బాల్ సంఘం అధ్యక్షుడు షేక్ మహబూబ్హుసేన్ ఆధ్వర్యంలో ఎంపికలు నిర్వహించారు. ఎంపికైన జట్టులో కె.వెన్నెల, రామలక్ష్మి, అనురాధ, డి.నిరీక్షణ, ఎన్.అఖిల, సాయికళ, తనూజ, పూజిత, శృతి, శ్రీదేవి, నందిని, రేష్మా, అరుణ, భానుశ్రీ, చంద్రవదన, సావిత్రిలు ఉన్నారు. ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి పలువురు హాజరు కాగా, తుది జట్టును ఫిజికల్ డైరెక్టర్ సంఘం వైస్ ప్రెసెడెంట్ తిరుపాల్రెడ్డి ఎంపిక చేశారు. ఈ జట్టు విశాఖలో జరగనున్న పోటీలకు వెళ్లాల్సి ఉంది.