ఎర్రచందనం స్వాధీనం.. ఒకరి అరెస్టు

ABN , First Publish Date - 2023-05-31T23:58:25+05:30 IST

అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసి రూ.10 లక్షల విలువ చేసే 245 కిలోల బరువున్న 11 ఎర్రచందనం దుంగలు స్వాఽధీనం చేసుకున్నట్లు డీ ఎస్పీ కె.కేశప్ప తెలిపారు.

ఎర్రచందనం స్వాధీనం.. ఒకరి అరెస్టు
పట్టుపడిన ఎర్రచందనం దుంగలతో పోలీసులు

మదనపల్లె, మే 31: అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసి రూ.10 లక్షల విలువ చేసే 245 కిలోల బరువున్న 11 ఎర్రచందనం దుంగలు స్వాఽధీనం చేసుకున్నట్లు డీ ఎస్పీ కె.కేశప్ప తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీ డియా సమావేశంలో వివరాలు వెల్లడిం చారు. గాలివీడు మండలం అరవీడు పంచాయతీ సింగంవారిపల్లెకు చెందిన పి.నాగరాజు కుమారుడు పి.విజయ్‌కుమార్‌ జేసీబీ డ్రైవర్‌. చెడు వ్యసనాలకు బానిసైన అతను, తన సమీప బంధువు మల్లికార్జున సహకారంతో మూడు నెలలుగా ఎర్రచందనాన్ని బెంగళూరు సమీపంలోని కటికన హళ్లికి అక్రమ రవాణా చేస్తున్నాడు. మంగళవారం గాలివీడు రోడ్డు దగ్గర కాలువలో దాచిన దుంగలను బెంగళూరులోని నవీద్‌బాషాకు చేర్చడానికి తరలిస్తూ బి.కొత్తకోట మండలం గుడిపల్లె పంచాయతీ మొరవపల్లె క్రాస్‌వద్ద ఎస్‌ఐ రామ్మోహనకు పట్టుబడ్డాడు. విజయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని, వాహనం, ఎర్రచందనం దుంగలను స్వాఽధీనం చేసుకున్నారు. మల్లికార్జున, నవీద్‌బాషా పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు.

=================================

Updated Date - 2023-05-31T23:58:25+05:30 IST