విషాదం నింపిన ఈత సరదా
ABN , First Publish Date - 2023-03-30T22:44:02+05:30 IST
పండుగ కోసం బంధువుల ఇంటికి వచ్చిన విద్యార్థి ఈత సరదా కుటుంబంలో వి షాదం నింపింది. స్నేహితులతో కలిసి ఈత కోసం వెళ్లిన జయంత్(13) మృత్యువాత పడ్డాడు.
చెరువులో పడి విద్యార్థి మృతి.....
కురబలకోట, మార్చి 30: పండుగ కోసం బంధువుల ఇంటికి వచ్చిన విద్యార్థి ఈత సరదా కుటుంబంలో వి షాదం నింపింది. స్నేహితులతో కలిసి ఈత కోసం వెళ్లిన జయంత్(13) మృత్యువాత పడ్డాడు.
గురువారం సాయంత్రం మండలంలో జరిగిన విషా దకర సంఘటనపై స్థానికుల కథనం మేరకు వివరా ల్లోకెళితే.... కర్నాటక రాష్ట్రం ముళబాగల్ సమీప వన్నెంపల్లె వాసులు నారాయణస్వామి, శారద కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు జయంత్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. కాగా రెండు రోజుల కిందట కంటేవారిపల్లెలో బంధువుల ఇంటికి వచ్చి సరదా గా గడిపాడు.
కాగా రాయుని చెరువులో తోటి స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తూ నీట మునిగి మృతి చెందాడు. స్థానికులు మృతదేహాన్ని వెలికితీశారు. కుమారుడు మృతిచెందడంతో కుటుంబీకులు బోరున విలపించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ముదివేడు పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. పోస్టుమార్టమ్ కోసం మదనపల్లెకు తరలించారు.