స్పందన అర్జీలు త్వరితగతిన పరిష్కరించండి
ABN , First Publish Date - 2023-02-06T22:43:08+05:30 IST
స్పందన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కమిషనర్ ప్రవీణ్చంద్ ఆదేశించారు.
- కమిషనర్ ప్రవీణ్చంద్
కడప (ఎడ్యుకేషన్), ఫిబ్రవరి 6: స్పందన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కమిషనర్ ప్రవీణ్చంద్ ఆదేశించారు. కార్పొరేషన్ స్పం దన హాలులో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి తగిన సూచనలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో 53 అర్జీలు వచ్చాయన్నారు. వీటిలో ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 18 అర్జీలు, టౌన్ ప్లానింగ్ 9, పబ్లిక్ అండ్ హెల్త్ 9, రెవెన్యూ 1, యుపీఏ 2, ఎస్టాబ్లి్షమెంట్ 5, కడప తహసీల్దారు 1, సీకేదిన్నె తహసీల్దారు 2, హౌసింగ్ 3, ఐసీడీఎస్ 1, ఆర్అండ్బి 1, అలాగే ఏపీ ఎస్పీడీసీఎల్ 1 అర్జీ వచ్చిందన్నారు. అర్జీలను సంబంధిత శాఖ అధిపతులకు పంపించడం జరిగిందని, అర్జీలన్నీ సకాలంలో పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పోరేషన్ అధికారులు పాల్గొన్నారు.