ఆలయంలోకి దళితులకు ప్రవేశం కల్పించిన ఆర్డీవో, డీఎస్పీ
ABN , First Publish Date - 2023-04-03T23:38:03+05:30 IST
మండలంలోని ఎస్.తిమ్మాపురం గ్రామంలో శ్రీరామనవమి రోజు రామాలయంలోకి తమను రానీయకుండా అగ్రవర్ణాల వారు అడ్డుకున్నారని ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్కు దళిత సంఘాలు ఫిర్యాదు చేశాయి.
కొండాపురం, ఏప్రిల్ 3: మండలంలోని ఎస్.తిమ్మాపురం గ్రామంలో శ్రీరామనవమి రోజు రామాలయంలోకి తమను రానీయకుండా అగ్రవర్ణాల వారు అడ్డుకున్నారని ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్కు దళిత సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో ఆయన ఎస్పీ అన్బురాజన్, కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. వెంటనే వారికి గుడిలోకి ప్రవేశం కల్పించాలని కలెక్టర్, ఎస్పీ ఆదేశించారు. దీంతో సోమవారం దళితులను జమ్మలమడుగు ఆర్డీఓ శ్రీనివాసులు, జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు రాములవారి గుడిలోకి ప్రవేశం కల్పించారు. దళితులు ప్రత్యేకపూజలు జరిపి ఆలయంలోకి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడున్న అగ్రవర్ణాల వారిని పిలిపించి మరొకసారి ఇలాంటిపనులు చేయవద్దని ఆర్డీఓ, డీఎస్పీ హితవుపలికారు. ఈ కార్యక్రమంలో కొండాపురం తహసీల్దార్ శోభన్బాబు, ఎస్ఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.