నేడు రాయచోటి న్యాయవాదుల సంఘం ఎన్నికలు

ABN , First Publish Date - 2023-03-30T23:18:26+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ న్యాయవాదుల సంఘం సూచనల మేరకు రాయచోటి న్యాయవాదుల సంఘం ఎన్నికలు శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరగనున్నాయి. న్యాయవాదుల సంఘం రెండు ప్యానల్లు పోటాపోటీగా తలపడుతున్నాయి.

నేడు రాయచోటి న్యాయవాదుల సంఘం ఎన్నికలు

రాయచోటిటౌన్‌, మార్చి 30: ఆంధ్రప్రదేశ్‌ న్యాయవాదుల సంఘం సూచనల మేరకు రాయచోటి న్యాయవాదుల సంఘం ఎన్నికలు శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరగనున్నాయి. న్యాయవాదుల సంఘం రెండు ప్యానల్లు పోటాపోటీగా తలపడుతున్నాయి. నాగిరెడ్డి ప్యానెల్‌లో సీనియర్‌ అధ్యక్షుడిగా న్యాయవాది కె.నాగిరెడ్డి, ఉపాధ్యక్షుడిగా కె.రాజ్‌కుమార్‌రాజు, ప్రధాన కార్యదర్శిగా ఉదయగిరి రామాంజనేయులు, సహాయ కార్యదర్శిగా టి.వెంకట్రమణ, ట్రెజరర్‌గా దేవపట్ల నాగమునెయ్య, స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ సెక్రటరీగా వేముల సిద్దయ్య, లైబ్రరీ సెక్రటరీగా ఆదిరెడ్డినాయక్‌లు ఉన్నారు. ప్రత్యర్థి ప్యానల్‌గా కె..రవిశంకర్‌ అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శిగా నాగమల్లు, సహాయ కార్యదర్శిగా వెంకటాద్రి, ట్రెజరర్‌గా వీరభద్ర, స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ సెక్రటరీగా రాంకుమార్‌, లైబ్రరీ సెక్రటరీగా వెంకట్రమణమూర్తిలు బరిలో ఉన్నారు. బార్‌అసోసియేషన్‌ న్యాయవాదులుగా 100 మందికి పైగా ఉండగా వారిలో 74 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రాయచోటి బార్‌ అసోసియేషన్‌లో 1976 నుంచి 47 సంవత్సరాల పాటు న్యాయవాది వృత్తిలో కొనసాగుతున్నారు. ఎన్నికల ఫలితాలు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలలోపు తెలియనున్నాయి.

Updated Date - 2023-03-30T23:18:26+05:30 IST