రోడ్డు భద్రత వారోత్సవం సందర్భంగా ర్యాలీ
ABN , First Publish Date - 2023-02-01T23:49:38+05:30 IST
రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ఆర్టీసీ టూ డిపో మేనేజరు నిరంజన ఆద్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహిం చారు.
మదనపల్లె అర్బన, ఫిబ్రవరి1: రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ఆర్టీసీ టూ డిపో మేనేజరు నిరంజన ఆద్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహిం చారు. జ్ఞానాంబిక కాలేజీ, శ్రీనివాస డిగ్రీ కళాశాల, ,జ్ఞానోదయ స్కూల్, విద్యార్థులు ర్యాలీలో పాలొన్నారు. స్థానిక టూ టౌన పోలీస్స్టేషన నుంచి ప్రారంభమైన ర్యాలీౖ టౌనబ్యాంకు సర్కిల్, బెంగళూరు బస్టాండ్, మల్లికా ర్జున సర్కిల్ మీదుగా జడ్పీ స్కూల్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ కార్యర కమంలో డిపో మేనేజర్ నిరంజన, టూ టౌన ఎస్ఐ చంద్రమోహన, ట్రాఫిక్ ఎస్ఐ, ఆర్టీసీ వన డిపో అసిస్టెంట్ మేనేజర్ రేవతి, ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బందితోపాటు విద్యార్థులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.