ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన

ABN , First Publish Date - 2023-03-25T22:37:11+05:30 IST

జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయం ఎదురుగా విశ్వహిందూ పరిషత్‌వారు శనివారం నిరసన వ్యక్తం చేశారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన
జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయ ఏవో ఇక్బాల్‌కు వినతి పత్రం అందజేస్తున్న విశ్వహిందూ పరిషత్‌ నాయకులు

జమ్మలమడుగు, మార్చి 25, జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయం ఎదురుగా విశ్వహిందూ పరిషత్‌వారు శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఆమోదించిన తీర్మాణం ద్వారా నిజమైన దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, అనాలోచిత నిర్ణయాల వలన నిజమైన దళితులకు తీవ్ర అన్యా యం జరుగుతోందన్నారు. పూర్వీకులు, రుషులు అందించిన సనాతనధర్మ ఆచారాలను పూర్తిగా తుడిచిపెట్టే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారన్నారు. అందుకు నిరసనగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నామన్నారు. అనంతరం ఆర్డీవో కార్యాలయ ఏవో ఇక్బాల్‌కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్‌ వారు మేడికుర్తి ఆదినారాయణ, సుధాకర్‌, మరో పది మంది సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T22:37:24+05:30 IST